Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానియా గెలుపు పాకిస్థాన్‌కు కూడా అత్యంత గౌరవప్రదం: మాలిక్

సానియా గెలుపు పాకిస్థాన్‌కు కూడా అత్యంత గౌరవప్రదం: మాలిక్
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (11:42 IST)
డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విజయంపై ఆమె భర్త.. పాకిస్థాన్ మాజీ క్రికెట్ కెప్టెన్ షోయబ్ మాలిక్ హర్షం వ్యక్తం చేశాడు. తన భార్య సాధించిన విజయాన్ని గర్వంగా భావిస్తున్నట్టు తెలిపాడు.

అంతేగాక భారత్, పాకిస్థాన్ దేశాలకు అత్యంత గౌరవప్రదమని పేర్కొన్నాడు. "ఈ విజయం పట్ల నేను చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నా. నా భార్యగా పాకిస్థాన్‌కు చాలా గర్వకారణం. అంతేకాదు 100 శాతం నిబద్ధతతో తన దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది" అని షోయబ్ పేర్కొన్నాడు. 
 
సానియా విజయం యువ అభిమానులకు ప్రేరణ ఇస్తుందని, తన భార్య గెలుపొందిన తరువాత సియోల్ కోటలో కుటంబ సభ్యులతో వేడుక జరుపుకున్నానని వెల్లడించాడు.

సానియాను వివాహం చేసుకోకముందు టెన్నిస్ అంటే చాలా ఇష్టమని, కానీ ఇప్పుడు తన హృదయమంతా నిజంగా అదే నిండి ఉందని చెప్పుకొచ్చాడు. భార్య ఆడుతున్న సమయంలో తానెపప్పుడు ఉండను కాబట్టి మిస్ అవుతున్నానన్న కారణంతో తన మ్యాచ్‌లు ఎప్పుడూ చూస్తుంటానని షోయబ్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu