Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెమీ ఫైనల్‌లో శక్తిమేరకు పోరాడారు... ధోనీ సతీమణి సాక్షి

సెమీ ఫైనల్‌లో శక్తిమేరకు పోరాడారు... ధోనీ సతీమణి సాక్షి
, శుక్రవారం, 27 మార్చి 2015 (12:04 IST)
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు విజయం కోసం శక్తి మేరకు పోరాడారాని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ అభిప్రాయపడింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ప్రదర్శనను చూసి ఎంతో గర్విస్తున్నట్టు ఆమె పేర్కొంది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
నిజానికి సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి క్వార్టర్ ఫైనల్ వరకు అద్భుత ప్రదర్శన చూపిన భారత క్రికెట్ జట్టు.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ప్రత్యర్థి నిర్ధేశించిన 329 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించలేక కేవలం 233 పరుగులకే ఆలౌట్ అంది. దీంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాక్షి సింగ్ ధోనీ మాత్రం ‘‘శక్తిమేర పోరాడారు. చాలా గర్వంగా ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో గెలిస్తే, కొన్నింటిలో ఓడిపోతుంటాం. ఏదేమైనా ఎట్టకేలకు నా భర్తను చూడబోతున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu