Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్‌కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్‌లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్

సచిన్‌కు సెంచరీలు చేయడం వరకే తెలుసు.. సెహ్వాగ్‌లా ఆడమని చెప్పేవాడ్ని: కపిల్
, గురువారం, 29 అక్టోబరు 2015 (17:21 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాస్టర్‌కు సచిన్‌కు సెంచరీలు చేయడమే తెలుసునని.. వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా మార్చడం ఎలాగనేది ఆతనికి తెలియదని.. అదే తెలిసుంటే సచిన్ మరింత ఎత్తులో ఉండేవాడని.. కపిల్ వ్యాఖ్యానించాడు. సెంచరీలు నమోదు చేసుకోవడం కాదని.. వీరేంద్ర సెహ్వాగ్‌లా డబుల్ సెంచరీలు ఎలా సాధించాలనేదానిపై దృష్టి పెట్టమని చాలాసార్లు చెప్పానని కపిల్ చెప్పాడు. 
 
మాస్టర్ సచిన్‌లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ.. దానికి సచిన్ సరైన న్యాయం చేయలేదని కపిల్ వ్యాఖ్యానించాడు. ఎన్నో డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సచిన్ ఖాతా నుంచి మిస్ అయ్యాయని, తన మాటలను తప్పుగా అనుకోవద్దని కపిల్ వ్యాఖ్యానించాడు. తాను తన అనుభవాన్ని మరింతగా వాడుకుని ఉంటే ఇంకా ఎక్కువ సమయం సేవలందిస్తూ ఉండేవాడన్నదే తన అభిప్రాయమన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu