Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్: 213 పరుగులకే పాక్ ఆలౌట్!

ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్: 213 పరుగులకే పాక్ ఆలౌట్!
, శుక్రవారం, 20 మార్చి 2015 (12:45 IST)
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా శుక్రవారం అడిలైడ్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తన ఇన్నింగ్స్‌లో 49.5 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 22 పరుగుల స్కోరు దగ్గరకు వచ్చేసరికే రెండు వికెట్లను కోల్పోయింది. 
 
అహ్మద్ హెహజాద్ (5), షర్ఫాజ్ అహ్మద్ (10) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్ వికెట్లు టపటపా రాలిపోయాయి. బోలెడంత స్కోరు చేయాలని బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ చివరికి 213 స్కోరు వద్ద తన ఇన్నింగ్స్‌ని ముగించింది. 
 
పాకిస్థాన్ ఆటగాళ్లలో మిస్బా ఉల్ హక్ (34), సోహైల్ (41) మినహా ఏ ఒక్కరూ 30 మించలేకపోయారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హజ్లేవుడ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టగా, స్టార్క్ 2 వికెట్లు, మాక్స్‌వెల్ 2 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. జాన్సన్ ఒక వికెట్ మాత్రం సాధించాడు. 

Share this Story:

Follow Webdunia telugu