Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్

టీమిండియా జింబాబ్వే టూర్: కెప్టెన్‌గా రెహానే.. కోహ్లీ, ధోనీకి రెస్ట్
, సోమవారం, 29 జూన్ 2015 (13:51 IST)
జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ అజ్యింకా రహానేకు ఈ టీమ్ సెలక్షన్‌లో భాగంగా బీసీసీఐ అధికారులు రెహానేకు ప్రమోషన్ ఇచ్చారు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీలు లేకుండా జింబాబ్వేకు వెళ్తున్న టీమిండియా జట్టు పగ్గాలను రెహానేకు ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 
 
అంతేకాక జింబాబ్వే టూర్‌కు ధోనీ, కోహ్లీ సహా రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనాలకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక వన్డే జట్టుకు సంబంధించి అశ్విన్ స్థానంలో హర్భజన్ సింగ్‌కు చోటు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వే జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. 
 
జింబాబ్వే టూర్‌కు వెళ్లే జట్టు వివరాలు:  అజింక్యా రెహానే, రాబిన్ ఊతప్ప, మురళీ విజయ్, అంబటి రాయుడు, మనీష్ తివారి, ఉమేశ్ యాదవ్, హర్భజన్ సింగ్, మోహిత్ శర్మ, బిన్నీ, దవళ్, కేదార్, సందీప్, అక్షర్, కరణ్ శర్మ, భువనేశ్వర్‌లకు స్థానం లభించింది. 

Share this Story:

Follow Webdunia telugu