Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ తాజా ట్వీట్: ఇరకాటంలో కాంగ్రెస్.. ప్రియాంకా, వాద్రాల్ని కలిశాడట!

మోడీ తాజా ట్వీట్: ఇరకాటంలో కాంగ్రెస్.. ప్రియాంకా, వాద్రాల్ని కలిశాడట!
, శుక్రవారం, 26 జూన్ 2015 (13:14 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అక్రమాలకు పాల్పడిన లలిత్ మోడీ రోజుకో బాంబు పేల్చుతున్నారు. బీజేపీని ఇరుకున పెట్టిన లలిత్ మోడీ.. కాంగ్రెస్‌పై పడ్డాడు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఇరుకున పెట్టే ప్రకటన చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలను కూడా తాను లండన్ హోటల్లో కలిశానని ట్వీట్ చేశాడు. ఫలితంగా ఆత్మరక్షణలో పడిన బీజేపీకి, లలిత్ మోడీ వ్యాఖ్యలతో కాస్త ఊరట లభించింది. అంతేగాకుండా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసేందుకు ఛాన్స్ దొరికింది. 
 
ఇకపోతే.. ఐపీఎల్‌లో ఆర్థిక నేరాలకు పాల్పడిన మోడీ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో దేశం విడిచి పారిపోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లలిత్ మోడీ ప్రకటనలతో సుష్మా స్వరాజ్‌తో పాటు రాజస్థాన్ సీఎం వసుంధర రాజే కూడా కూడా చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదం మోడీ సర్కారుకు గుదిబండగానే మారిన నేపథ్యంలో లలిత్ మోడీ తాజా వ్యాఖ్యలు బీజేపీకి ఊపిరి పీల్చుకునేలా చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu