Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కపిల్‌ దేవ్‌ను సతీసమేతంగా కలిసిన అల్లు అర్జున్!

కపిల్‌ దేవ్‌ను సతీసమేతంగా కలిసిన అల్లు అర్జున్!
, గురువారం, 1 అక్టోబరు 2015 (11:18 IST)
ఫాస్ట్ బౌలింగ్‌తో ఉరకలు పెట్టించిన లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్‌ను అల్లు అర్జున్ దంపతులు కలిశారు. కపిల్ సారథ్యంలోనే టీమిండియా తన తొలి వరల్డ్ కప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ కపిల్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిశాడు. ఈ సందర్భంగా తన భార్య స్నేహరెడ్డిని కూడ తీసుకెళ్లాడు. 
 
ఈ ఫోటోలను అల్లు అర్జున్ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. "మన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్‌ను కలిశాం. ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. చాలా సింపుల్‌గా ఉన్నారు. సెట్ మ్యాక్స్‌లో హిందీలోకి డబ్ అయిన సౌత్ ఇండియా సినిమాలను చూస్తానని కపిల్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని చెప్పారు. రేసు గుర్రంలో తన నటన గురించి ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు. నాకెంతో గర్వంగా ఉంది" అంటూ పోస్ట్ చేశాడు. రేసు గుర్రం సినిమాపై కపిల్ దేవ్ ప్రశంసలు గుప్పించారు. 
 
కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ సరైనోడు సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. బోయపాటి శీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే 20 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2016 సమ్మర్‌కు రిలీజ్ కానుంది.

Share this Story:

Follow Webdunia telugu