Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏప్రిల్ 7న ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ: కోహ్లీ కోసం అనుష్క డ్యాన్స్!

ఏప్రిల్ 7న ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ: కోహ్లీ కోసం అనుష్క డ్యాన్స్!
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:35 IST)
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ప్రపంచకప్‌లో టీమిండియాకు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశచెందిన క్రికెట్ ఫ్యాన్స్‌కు సొంత గడ్డపై మరో క్రికెట్ ఈవెంట్ సిద్ధమైంది. భారత్‌లో ఈ నెల 8 నుంచి ఐపీఎల్-8 పోటీలు జరగనున్నాయి. కాగా, ఐపీఎల్ ప్రారంభోత్సవానికి కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా నిలవనుంది. ఏప్రిల్ 7న ఆరంభ వేడుకలను ఘనంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ బడా స్టార్లు పాల్గొంటున్నారు. త్వరలోనే వారి పేర్లు ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, తాజా సీజన్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్ సీజన్‌లో మెరుగ్గా ఆడేందుకు వేలం పాటలో ఎంపికైన ఆటగాళ్లు రెడీగా ఉన్నారు. తమ తమ ఫ్రాంచైజీలకు పేరు తెచ్చే దిశగా రాణించాలని ఆయా టీమ్‌లకు చెందిన క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. 
 
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ కోసం అనుష్క శర్మ డ్యాన్స్ ఉంటుందని సమాచారం. ప్రపంచకప్‌లా కాకుండా ఐపీఎల్‌లో ధీటుగా రాణించాలని ఆశిస్తూ.. తన లవర్‌కు ఎంకరేజ్ చేసేందుకు వీలుగా అనుష్క డ్యాన్స్ ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu