Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కసితో ఉన్న భారత్.. సొంతగడ్డపై ఓడించడం సవాలే.. అయినా గెలుస్తాం!

కసితో ఉన్న భారత్.. సొంతగడ్డపై ఓడించడం సవాలే.. అయినా గెలుస్తాం!
, శనివారం, 10 అక్టోబరు 2015 (17:29 IST)
సొంతగడ్డపై ట్వంటీ-20 సిరీస్ ఓడిన భారత్.. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో కసిగా ఆడుతుందని దక్షిణాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ డివిలియర్స్ అన్నాడు. కానీ భారత్‌పై ట్వంటీ-20 సిరీస్ నెగ్గడం తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందన్నాడు. విజయమే లక్ష్యంగా వన్డే సిరీస్‌ను ప్రారంభించనున్నామని డివిలియర్స్ తెలిపాడు. భారత్ గెలుపును అడ్డుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతామని డివిలియర్స్ చెప్పాడు. అయితే తమకు గెలుపంటేనే ఇష్టమని, విజయం  కోసం వంద శాతం కష్టపడతామని డివిలియర్స్ తెలిపాడు.
 
కాన్పూర్‌‍లో శనివారం డివిలియర్స్ మాట్లాడుతూ.. భారత్‌తో అసలైన పోరాటం ఆదివారం నుంచే ప్రారంభం కానుందన్నాడు. పటిష్ఠమైన భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాలేనన్నాడు. వన్డే రూపంలో వివిధ రకాలైన వికెట్లపై, వివిధ రకాలైన వాతావరణ పరిస్థితుల్లో భారత్‌ను ఎదుర్కోవడం తమ ఆటగాళ్లకు సిసలైన పరీక్షలాంటిదని డివిలియర్స్ పేర్కొన్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu