Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియా భారీ స్కోరు: రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. బిన్నీహాఫ్ సెంచరీ మిస్

టీమిండియా భారీ స్కోరు: రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. బిన్నీహాఫ్ సెంచరీ మిస్
, సోమవారం, 31 ఆగస్టు 2015 (13:24 IST)
శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా లంక భారీ స్కోరును ముందుంచింది. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. భారత బ్యాట్స్‌మెన్లు స్కోరు బోర్డును పరిగెత్తిస్తారు. నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 132 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతను కలుపుకోవడంతో భారత్ ఇప్పటివరకు 243 పరుగుల ఆధిక్యతను సాధించింది. మరో ఐదు వికెట్లు చేతిలో ఉన్న నేపథ్యంలో, శ్రీలంకు టఫ్ టార్గెట్ నిర్దేశించడం ఖాయంగా కనిపిస్తోంది.
 
భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా (0), రాహుల్ (2), రహానే (4), కోహ్లీ (21) విఫలమైనప్పటికీ... రోహిత్ శర్మ 50 పరుగులు చేసి స్కోరు బోర్డును గాడిలో పెట్టాడు. అలాగే అర్థ సెంచరీ దిగా ఆడిన బిన్నీ 49 పరుగులకే అవుట్ కావడంతో, నమన్ ఓజా (28), మిశ్రా (1)లు క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్, ప్రదీప్ చెరో మూడేసి వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu