Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత బౌలర్ల విజృంభణ: విండీస్‌కు వణుకు.. 85 పరుగులకే 7వికెట్లు డౌన్!

భారత బౌలర్ల విజృంభణ: విండీస్‌కు వణుకు.. 85 పరుగులకే 7వికెట్లు డౌన్!
, శుక్రవారం, 6 మార్చి 2015 (15:03 IST)
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా బౌలర్లు విజృంభించారు. విండీస్‌తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో బౌలర్లు విండీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు.

టీమిండియా బౌలర్ల ధాటిగా విండీస్ బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. ఈ క్రమంలో 24.1 ఓవర్లలో కేవలం 85 పరుగులిచ్చి 7 వికెట్లను కూల్చారు. తాజాగా, ఆండీ రసెల్... జడేజా బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
కెప్టెన్ సామీ కూడా షమీ బంతికి వెనుదిరిగాడు. ప్రస్తుతం హోల్డర్ (43), టాయిలర్ (6) క్రీజులో ఉన్నారు. త్వారా 40 ఓవర్లలో విండీస్ 8 వికెట్ల పతనానికి 162 పరుగులు సాధించింది. హోల్డర్ విండీస్ టీమ్ లోనే అధిక స్కోరుతో హాఫ్ సెంచరీ దిశగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత బౌలర్లలో విజృంభించిన షమీ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగా, యాదవ్, అశ్విన్, శర్మ, జడేజా తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu