భారత్ - శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడో టి-20 మ్యాచ్ విశాఖపట్టణంలో జరుగనుంది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. విశాఖ మ్యాచ్ నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో.. విజయమేలక్ష్యంగా రెండు జట్లూ పోటీకి దిగుతున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్లో విజయం దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.
మరోవైపు.. ప్రత్యర్థి జట్టుతో పోల్చిచూస్తే.. ధోనీ సేన అన్నివిభాగాలలోనూ అత్యంత పటిష్టంగా, సమతూకంతో కనిపిస్తోంది. అయితే, విశాఖ పిచ్లో ఎలాంటి తేడా లేకుండా ఉంటే.. పరుగుల మోత మోగడం ఖాయమని తెలుస్తోంది. కాగా, రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోటీ కోసం... విశాఖ అభిమానులతో పాటు,దేశంలోని క్రికెట్ అభిమానులు సైతం..ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.