Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా: భారత జట్టు ఎంపిక రేపే.. ఆ ముగ్గురికి?

బంగ్లాదేశ్ టూర్‌కు టీమిండియా: భారత జట్టు ఎంపిక రేపే.. ఆ ముగ్గురికి?
, మంగళవారం, 19 మే 2015 (12:09 IST)
బంగ్లాదేశ్ టూరుకు వెళ్తున్న టీమింయా జట్టును బుధవారం ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బుధవారం ముంబైలో సమావేశమై జట్టును ఖరారు చేస్తుందని బీసీసీఐ ప్రకటించింది. టెస్టులకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ నాయకత్వంలో టీమిండిమా టెస్టు జట్టు బంగ్లా వెళ్లనుంది. అయితే విరాట్ కోహ్లీకి బంగ్లా టూర్‌కు వెళ్లేది ఉండదని, ఆయనకు విశ్రాంతి ఇచ్చే దిశగా సెలక్టర్లు చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. 
 
ఇక టెస్టులకు గుడ్ చెప్పిన తర్వాత జరుగుతున్న సిరీస్ కావడంతో ధోనీ బంగ్లా టూర్‌కు వెళతాడా? లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు జట్టులో చోటు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న స్టార్ ప్లేయర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతం గంభీర్‌లకు ఈ సిరీస్‌లో చోటు దక్కడం ఖాయమన్న ఊహాగానాల నేపథ్యంలో బుధవారం సెలెక్షన్ కమిటీ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu