Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇప్పుడున్న జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదు: రవిశాస్త్రి

ఇప్పుడున్న జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదు: రవిశాస్త్రి
, గురువారం, 27 ఆగస్టు 2015 (19:04 IST)
ఇప్పుడున్న టీమిండియా జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదని టీమండియా డైరక్టర్ రవిశాస్త్రి అన్నారు. శ్రీలంకతో చివరి టెస్టు కొలంబోలో జరుగనున్న నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితిని బట్టి జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు.  
 
పరిస్థితిని బట్టి ఎవరి అవసరం ఉంటుందో వారినే బ్యాటింగ్, బౌలింగ్‌కు పంపుతామని.. ఈ సూత్రం బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలకూ వర్తిస్తుందన్నారు. గాలే టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలో దిగామని, కొలంబో టెస్టులోనూ అందులో మార్పులేదని అన్నారు. 
 
గత టెస్టులో ఆడిన విధంగా చివరి టెస్టులోనూ సరైన క్రికెట్ ఆడతామని రవిశాస్త్రి చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ పొజిషన్ మారుతూ వుంటుందని చెప్పారు. మూడో టెస్టుకు ఎలాంటి మార్పులు లేకపోయినా.. విజయం సాధించే దిశగా బ్యాటింగ్ పొజిషన్, బౌలింగ్‌పై మార్పులుంటాయన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu