ప్రపంచ కప్ పోటీలు ముగిసిన అనంతరం ఐసీసీ ప్రకటించిన ప్రపంచ కప్ 2015 జట్టులో భారత క్రికెటర్లు స్థానం కోల్పోయారు. వరల్డ్ కప్ పోటీల్లో రాణించిన భారత బౌలర్లు ఉమేష్ యాదవ్ (18), షమీ (17), అశ్విన్ (13) పేర్లు చర్చకు వచ్చినా తుది జట్టులోకి తీసుకోలేదు. ఐసీసీ డ్రీమ్ జట్టు పగ్గాలు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ కు అప్పగించగా, అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగక్కర, వెటోరిలకు స్థానం దక్కింది.
ఇక టాప్ స్కోరర్ మార్టిన్ గుప్తిల్తో పాటు స్టీవెన్ స్మిత్, డివిలియర్స్, మ్యాక్స్ వెల్, కోరీ ఆండర్సన్లకు చోటు దక్కింది. బౌలర్ల జాబితాలో టాపర్ స్టార్క్, బౌల్ట్, మోర్నీ మోర్కెల్ను ఎంపిక చేశారు. వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ను 12వ సభ్యుడిగా తీసుకున్నారు.