Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ధోనీ విలువ తగ్గదు: భోగ్లే

ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ధోనీ విలువ తగ్గదు: భోగ్లే
, మంగళవారం, 13 అక్టోబరు 2015 (10:34 IST)
ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన కెప్టెన్ ధోనీ విలువ తగ్గదని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే పేర్కొన్నారు. పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మహీ దిట్ట అని, మరోసారి ధోనీ చెలరేగుతాడని ఆయన ఆకాంక్షించారు. కానీ ధోనీ విఫలమైననప్పుడు ఆదుకునేందుకు మరో ఫినిషర్ కావాలని అభిప్రాయపడ్డారు. తొలి వన్డేలో భారత్ ఓటమిపై ఆయన మాట్లాడుతూ, ధోనీ అద్భుతమైన ఫినిషర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 
 
ధోనీ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రస్తుతం కనబడుతున్న ఆటగాడు సంజు శాంసన్ అని భోగ్లే పేర్కొన్నారు. సంజు శాంసన్‌కు కీపర్, బ్యాట్స్‌మన్‌గా రాణించే సత్తా ఉందని ఆయన పేర్కొన్నారు. ధోనీ ఉచ్ఛదశకు చేరుకుంటున్న ప్రస్తుత తరుణంలో సంజు శాంసన్ మంచి ప్రత్యామ్నాయం కాగలడన్నారు.

Share this Story:

Follow Webdunia telugu