Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ క్వార్టర్స్ మ్యాచ్ ఫలితం వెనక శ్రీనివాసన్: మళ్లీ సీన్లోకి కమల్..

వరల్డ్ క్వార్టర్స్ మ్యాచ్ ఫలితం వెనక శ్రీనివాసన్: మళ్లీ సీన్లోకి కమల్..
, శుక్రవారం, 26 జూన్ 2015 (14:57 IST)
ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌‍లో భారత్-బంగ్లాదేశ్‌ల జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ వివాదాన్ని ఐసీసీ మాజీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ వరల్డ్ కప్ వివాదాన్ని తిరగదోడారు. ఆ మ్యాచ్‌లో కొన్ని అంపైరింగ్ నిర్ణయాలే భారత్‌కు అనుకూలంగా వచ్చాయని ఆరోపించడం ద్వారా కమల్ అప్పట్లోనే పెద్ద దుమారం లేపారు.
 
బంగ్లాదేశ్ జట్టు తాజాగా భారత్‌పై సిరీస్ నెగ్గడం పట్ల కమల్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ.. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ గెలవకుంటే.. సెమీస్ వరకు వచ్చేదే కాదన్నారు. మ్యాచ్ ఫలితమే బంగ్లాదేశ్‌ను ఓడించిందని చెప్పాడు. 
 
వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ సమరంలో భారత్ విజయం వెనుక ఎన్.శ్రీనివాసన్ ఉన్నారని ఆరోపించారు. మ్యాచ్ ఫలితాన్ని ఆయనే ప్రభావితం చేశారని మండిపడ్డారు. భారత్‌లో క్రికెట్ వ్యవస్థను నడిపించే ఆయనే, మెల్ బోర్న్ మ్యాచ్‌లోనూ చక్రం తిప్పారని వివరించారు.  

Share this Story:

Follow Webdunia telugu