Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పూణె ఓటమి టీమిండియాకు మంచే చేసింది : కెప్టెన్ ధోనీ

పూణె ఓటమి టీమిండియాకు మంచే చేసింది : కెప్టెన్ ధోనీ
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:23 IST)
శ్రీలంకతో పూణేలో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మంచే చేసిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కారణంగా పర్యాటక శ్రీలంక జట్టు చేతిలో ఓడిన విషయం తెల్సిందే. దీనిపై ధోనీ స్పందిస్తూ.. బ్యాట్స్‌మన్ షాట్ సెలక్షన్ కొంపముంచిందన్నాడు. 
 
వన్డేల్లా వేచి చూసి ఆడే అవకాశం టీట్వంటీల్లో ఉండదని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కావడంతో జట్టులోని అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని, దీంతో ఎవరు ఎలా ఆడతారు అనే అంచనా చిక్కిందని ధోనీ చెప్పుకొచ్చాడు. 
 
జట్టు మొత్తం విఫలమవడంతో విజయగర్వంతో ఆడకూడదని ఆటగాళ్లకు అర్థమై ఉంటుందని ధోనీ చురకంటించాడు. శ్రీలంక ఆటగాళ్లలో రజిత, శనక, చమీరలు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. రెండో టీట్వంటీలో జట్టు పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ధోనీ వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu