Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువీ ఒక్కో రన్‌కు ఖరీదెంతో తెలుసా? అక్షరాలా రూ.8లక్షలు!

యువీ ఒక్కో రన్‌కు ఖరీదెంతో తెలుసా? అక్షరాలా రూ.8లక్షలు!
, బుధవారం, 20 మే 2015 (12:37 IST)
టీమిండియా స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ చేసిన ఒక్కో పరుగు బాగా క్యాష్ చేసుకున్నారు. 14 మ్యాచ్‌లు, 248 పరుగులు, హైయ్యస్ట్ 57, సరాసరి 19.07, స్ట్రయిక్ రేటు 118.09... ఇవి యువరాజ్ సింగ్ ఐపీఎల్ 8వ సీజన్ గణాంకాలు. యువరాజ్‌ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ వెచ్చించిన సొమ్ము రూ. 16 కోట్లు. అంటే, ఈ ఐపీఎల్‌లో యువరాజ్ చేసిన ఒక్కో పరుగుకు ఆయనకు లభించిన మొత్తం దాదాపు రూ. 8 లక్షలు. 
 
ఈ సీజన్లో చేసిన పరుగులకు, ఫ్రాంచైజీ కొనుక్కున్న రేటుతో పోలిస్తే ఇంత అధిక మొత్తం దక్కింది ఒక్క యువరాజ్‌కే. వన్డే క్రికెట్ కెరీర్లో తొలి మ్యాచ్ నుంచే రాణించిన యువరాజ్ ఎన్నో మార్లు మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన సందర్భాలున్నాయ్. కానీ, ఐపీఎల్ పోటీల్లో మాత్రం ఒక్క సీజన్లోనూ రాణించలేకపోయాడు. గత ఎనిమిదేళ్లలో ఏ సంవత్సరమూ అతని స్కోరు 400 పరుగులు దాటలేదు. యువరాజ్‌తో పోలిస్తే చాలా తక్కువ తీసుకున్న ఆటగాళ్లు ఎంతో మెరుగ్గా ఆడి రాణించారు. ఇక వచ్చే సంవత్సరం సీజన్ పరిస్థితి ఎలా ఉంటుందో?

Share this Story:

Follow Webdunia telugu