వన్డే జట్టులో స్థానం కావాలా.. అయితే కోహ్లీ, రోహిత్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే..

సెల్వి
బుధవారం, 12 నవంబరు 2025 (13:10 IST)
టీమిండియా సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి టీమిండియా వన్డే జట్టులో స్థానం దక్కాలంటే.. వారిద్దరూ తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టం చేసింది. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం కేవలం 50 ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో వారి మ్యాచ్ ఫిట్‌నెస్‌ను నిర్ధారించుకోవడానికే బోర్డు ఈ నిబంధన విధించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక జరగనున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ ఆడాలని బోర్డు సూచించినట్లు సమాచారం. ఇక బీసీసీఐ ఆదేశాలకు రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు తాను అందుబాటులో ఉంటానని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు సమాచారం ఇచ్చాడు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన లభ్యతపై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తను చనిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తను చూస్తున్న నటుడు ధర్మేంద్ర, ఇంతకన్నా దారుణం ఏముంటుంది?

డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ: అద్భుతమైన బోధకురాలు ఉగ్రవాదిగా ఎలా మారిపోయింది?!

నవంబర్ 21లోపు కోర్టుకు హాజరు అవుతాను.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

తర్వాతి కథనం
Show comments