Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ డ్రా : నాలుగో రోజూ వర్షంతో అంపైర్ల నిర్ణయం

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ డ్రా : నాలుగో రోజూ వర్షంతో అంపైర్ల నిర్ణయం
, బుధవారం, 18 నవంబరు 2015 (12:16 IST)
ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి రోజు ఆట తర్వాత వరుసగా నాలుగు రోజులుగా వర్షం అడ్డంకిగా మారిన విషయం తెల్సిందే. దీంతో ఐదో రోజైన నేడు వర్షం కారణంగా ఆట జరగని నేపథ్యంలో మ్యాచ్‌ను అంపైర్లు డ్రాగా ప్రకటించారు. 
 
కాగా, శనివారం ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థి సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. కేవలం 59 ఓవర్లలోనే సఫారీలను 214 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండానే 22 ఓవర్లలో 80 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి రోజు నుంచే వరుణుడు మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో టీమిండియా సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న విషయం తెల్సిందే. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో మూడో టెస్టు నాగ్‌పూర్ వేదికగా ఈ నెల 25న ప్రారంభం కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu