Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ ఓటమికి పిచ్ క్యూరేటరే కారణమట.. రవిశాస్త్రిపై సుధీర్ ఫిర్యాదు..!

భారత్ ఓటమికి పిచ్ క్యూరేటరే కారణమట.. రవిశాస్త్రిపై సుధీర్ ఫిర్యాదు..!
, సోమవారం, 26 అక్టోబరు 2015 (12:33 IST)
ముంబైలో భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనపై టీమ్ డైరక్టర్ రవిశాస్త్రి వింతగా స్పందించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ క్యూరేటర్ సుధీర్ నాయక్, రవిశాస్త్రిల మధ్య ఘాటైన సంభాషణ జరిగిందని.. దీనిపై బీసీసీఐకి సుధీర్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికా మెరుగ్గా రాణించిన వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో... భారత్ ఓటమికి పిచ్ క్యూరేటర్ కారణమని రవిశాస్త్రి విమర్శించాడని తెలిసింది. 
 
క్యూరేటర్ వద్దకు వెళ్లిన రవిశాస్త్రి గొప్ప వికెట్ తయారు చేశావంటూ వ్యంగ్యంగా మాట్లాడటంపై సుధీర్ కూడా స్పందించాడట. వికెట్ గురించి తనకు కొత్తగా పాఠాలు చెప్పాల్సిన పనేమీలేదని, తాను కూడా భారత జట్టు కోసం ఆడాననే విషయాన్ని గుర్తు చేశాడట. కాగా, పిచ్ కనీసం 350 పరుగులు సంపాదించేలా చూడాలని ముందే క్యూరేటర్‌కు పెద్దలు చెప్పినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu