Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెమీ ఫైనల్‌లో భారత్ గెలవాలని నాలుక కోసుకున్న వీరాభిమాని!

సెమీ ఫైనల్‌లో భారత్ గెలవాలని నాలుక కోసుకున్న వీరాభిమాని!
, శుక్రవారం, 27 మార్చి 2015 (10:18 IST)
అభిమానానికి హద్దు ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు. అభిమానం హద్దులు దాటితే ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చదివితే తెలుస్తుంది. తమిళనాడులోని వేలూరుకు చెందిన సుధాకర్ అనే 21 యేళ్ళ యువకుడు క్రికెట్ అంటే ప్రాణం. అదీ భారత మ్యాచ్‌లతో మరింత పిచ్చి. దీంతో టీమిండియాకు వీరాభిమానిగా మారిపోయాడు. 
 
లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ వరకు భారత విజయాత్ర అప్రతిహతంగా సాగడంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా ప్రత్యర్థి కావడంతో టీమిండియా విజయం సాధించాలని బలంగా కోరుకున్నాడు. ఇందుకోసం తన ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించి... విజయం కోసం తన నాలుక కోసుకున్నాడు. 
 
అతడి చర్యను గమనించిన బంధువులు, స్నేహితులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆ హడావుడిలో తెగిపడిన నాలుక ముక్క తీసుకెళ్లకపోవడంతో మైక్రోసర్జరీ చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసి నాలుకను అమర్చే ప్రయత్నం చేస్తామని వారు వెల్లడించారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కానీ, గురువారం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఏమాత్రం పోరాటం చేయకుండా చిత్తుచిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu