Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళి కూతురు నచ్చలేదు.. కళ్యాణ మండపం నుంచి వరుడు పరార్.. కేసు నమోదు..!

పెళ్లి మండపం నుంచి పెళ్ళి కొడుకు పరారయ్యాడు. ఈ ఘటన చెన్నై రాయపురంలో సంచలనం సృష్టించింది. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ అమ్మాయి నచ్చలేదంటూ పెళ్లిమండపం నుంచి వరుడు పరారయ్యాడు.

పెళ్ళి కూతురు నచ్చలేదు.. కళ్యాణ మండపం నుంచి వరుడు పరార్.. కేసు నమోదు..!
, గురువారం, 7 జులై 2016 (10:45 IST)
పెళ్లి మండపం నుంచి పెళ్ళి కొడుకు పరారయ్యాడు. ఈ ఘటన చెన్నై రాయపురంలో సంచలనం సృష్టించింది. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్న వేళ అమ్మాయి నచ్చలేదంటూ పెళ్లిమండపం నుంచి వరుడు పరారయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. పాండిదురైకి తిరువొత్తియూరు మురుగప్పానగర్‌కు చెందిన జయంతి (27) అనే యువతితో గత మే నెల 18న నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి రాయపురం కల్యాణమండపంలోనూ, వివాహం బుధవారం ఉదయం వడపళని మురుగన్ ఆలయంలో జరపాలని నిర్ణయించారు. 
 
మంగళవారం సాయంత్రం వివాహ రిసెప్షన్ ఏర్పాట్లు జరుగుతుండగా వరుడు పాండిదురై జంప్ అయ్యాడు. ఆ తర్వాత పాండి దురై కుటుంబీకులు రిసెప్షన్ రద్దు చేసుకున్నట్లు చెప్పడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. మండపం వరకు వచ్చిన కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో తీవ్రంగా మనస్తాపం చెందారు.

పాండిదురై కుటుంబీకులతో వధువు తరపు బంధువులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో వధువు కుటుంబీకులు ఎన్నూరు మహిళా పోలీసుస్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పాండిదురై ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితురాలు కంటిపై గుద్దింది.. కంటిపై రెప్పలోని నరం చిట్లింది.. కంటి నుంచి ధారగా రక్తం!