Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియురాలితో కలిసి నటి శశిరేఖను హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేశా: రెండో భర్త రమేష్

ప్రియురాలితో కలిసి నటి శశిరేఖను హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేశా: రెండో భర్త రమేష్
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:56 IST)
కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటి శశిరేఖ హత్యకేసుకు చిక్కుముడి వీడింది. కోలీవుడ్‌లో పలు టీవీ సీరియళ్లలో, సినిమాల్లో వర్ధమాన నటిగా ఎదుగుతున్న శశిరేఖ గత నెల 5న చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయంతెల్సిందే. ఓ చెత్త కుండీలో దొరికిన మొండెం శశిరేఖదేనని పోలీసులు నిర్ధారించారు. ఆమె తలను అక్కడికి 2 కి.మీ.ల దూరంలోని కొలపాక్కం దగ్గరి కాలువలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
 
పోలీసుల సేకరించిన వివరాల ప్రకారం.. తమిళ సినీ ఇండస్ట్రీలో కొత్తవాళ్ళకు.. ముఖ్యంగా అమ్మాయిలకు అవకాశం కల్పించే ఏజెన్సీని రమేష్ అనే వ్యక్తి నిర్వహిస్తూ వచ్చాడు. మాజీ భర్తతో విడాకులు తీసుకున్న శశిరేఖ ఈయనను గత ఆగస్టు నెలలో వివాహం చేసుకుంది. ఆమెకు 8 ఏళ్ల కూతురు కూడా వుంది. 
 
ఇదిలావుంటే.. మరో నటి అయిన లకియాతో రమేష్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచి శశిరేఖ, రమేష్ మధ్య గొడవలు మొదలయ్యాయి. రమేష్‌పై శశిరేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కేసు పెట్టిందన్న ఆగ్రహంతో రమేష్, లకియా.. శశిరేఖను దారుణంగా హత్యచేశారు. హత్య చేసి పరారీలో ఉన్న వీరిద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భర్త రమేష్ శంకర్, ప్రేయసి లక్కియ కలిసి శశిరేఖను హత్య చేసినట్టు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu