Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి అంగీకరించలేదని యువతి ముఖంపై వాతలు పెట్టిన కిరాతకుడు

పెళ్లికి అంగీకరించలేదని ఓ యువతి ముఖంపై వాతలు పెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన చెన్నైలోని తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... తిరుప్పూర్ ముత్తయ్యనగర్‌కు చెందిన షణ్ముగప్రియ(21) అదే

పెళ్లికి అంగీకరించలేదని యువతి ముఖంపై వాతలు పెట్టిన కిరాతకుడు
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (16:21 IST)
పెళ్లికి అంగీకరించలేదని ఓ యువతి ముఖంపై వాతలు పెట్టాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన చెన్నైలోని తిరుప్పూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... తిరుప్పూర్ ముత్తయ్యనగర్‌కు చెందిన షణ్ముగప్రియ(21) అదే ప్రాంతంలోని ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. ఆమె బంధువైన పద్మనాభన్(23) కూడా అదే దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కొద్దికాలంలోనే ప్రేమగా మారింది. 
 
ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో షణ్ముగప్రియ అతడికి దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం షణ్ముగప్రియ ఇంటికి వెళ్లిన పద్మనాభన్ తనను వివాహం చేసుకోవాలని అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన పద్మనాభన్ వంటగదిలోకి వెళ్లి వేడిగా ఉన్న పెనుముని తీసుకొచ్చి షణ్ముగప్రియ ముఖం, చేతులపై కాల్చాడు. 
 
దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని తిరుప్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన తిరుప్పూర్ పోలీసులు కేసు నమోదుచేసి పద్మనాభన్‌ను అరెస్ట్ చేసారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యలంక బీచ్‌లో మునిగి మృతి చెందిన బీటెక్ విద్యార్థిని