ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ను పట్టుకున్నారు. రఘురాం రాజన్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరుతూ స్వామి లేఖ రాశారు.
రాజన్పై తొలగించాలంటూ ఇప్పటికే ఓ లేఖ రాసిన సుబ్రహ్మణ్య స్వామి.. రెండో సారి రాసిన లేఖలో గవర్నర్గా రాజన్ అనర్హుడంటూ ఆరోపించారు. వడ్డీ రేట్లు పెంచడంతో పాటు భద్రతలేని ఈ-మెయిల్ వినియోగించడం వంటి ఆరు ఆరోపణలు రాజన్పై ఉన్నాయని స్వామి ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆర్థికపరమైన కీలక సమాచారాన్ని కనీస భద్రత లేని చికాగో యూనివర్శిటీకి చెందిన ఈ-మెయిల్ ఐడీ ద్వారా పంపిస్తున్నారని స్వామి ఆ లేఖలో ఆరోపించారు. అంతేగాక.. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా భారత్లో అత్యున్నత హోదాలో ఉన్నప్పటికీ, రాజన్ అమెరికా గ్రీన్ కార్డును పొడిగించుకుంటున్నారని సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు.