Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండియాలో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య: 11వ స్థానంలో భారత్

ఇండియాలో పెరుగుతున్న మిలియనీర్ల సంఖ్య: 11వ స్థానంలో భారత్
, బుధవారం, 16 సెప్టెంబరు 2015 (14:28 IST)
ఆర్సీబీ వెల్త్ మేనేజ్‌మెంట్ తాజాగా విడుదల చేసిన నివేదికలో అత్యధికంగా సంపన్నుల్ని కలిగివున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో నిలిచింది. భారత్‌లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. 2014కి గానూ భారత్‌లో మొత్తం 1.98 లక్షల మంది సంపన్నులు ఉన్నారని ఆర్సీబీ నివేదిక వెల్లడించింది. 
 
ఆసియా పసిఫిక్ రీజియన్లో, ఇండియా టాప్-3లో ఉందని ఆర్బీసీ వెల్లడించింది. 2013లో ఇండియా 1.56 లక్షల మంది ధనవంతులను కలిగివుందని గుర్తు చేసింది. ఇక, అత్యధికంగా సంపన్నులు కలిగివున్న దేశంలో అమెరికా (43.51 లక్షల మంది ధనికులు) టాప్‌లో నిలవగా, రెండో స్థానంలో జపాన్ (24.52 లక్షలు) నిలిచింది. ఇక జర్మనీ (11.41 లక్షలు), చైనా (8.90 లక్షలు) టాప్-4లో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu