Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి అంత్యక్రియల కోసం సుబ్రతా రాయ్‌కు 4 వారాల పెరోల్

తల్లి అంత్యక్రియల కోసం సుబ్రతా రాయ్‌కు 4 వారాల పెరోల్
, శుక్రవారం, 6 మే 2016 (17:09 IST)
సహారా స్కామ్‌లో ప్రధాన నిందితుడైన సుబ్రతా రాయ్‌కు సుప్రీంకోర్టు నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది. సుబ్రతా రాయ్ తల్లి ఛబీ రాయ్(95) దీర్ఘకాల అనారోగ్యంతో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత రెండేళ్ల నుంచి ఛబీ రాయ్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. 
 
తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్ కావాలని ఆయన దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపి పెరోల్ ఇచ్చింది. పెరోల్ సమయంలో రాయ్ కదలికలను పోలీసులు సివిల్ దుస్తుల్లో ఉండి గమనించనున్నారు. 
 
మార్కెట్ నిబంధనలు ఉల్లంఘించి మదుపరుల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన రెండు సంస్థలు భారీగా నిధులను సమీకరించాయన్న కేసులో గత రెండేళ్ల నుంచి సహారా అధినేత సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉంటున్న విషయం విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ సర్కారుకు కొమ్ముకాయడం తప్ప జయలలిత చేసిందేమీ లేదు: సోనియా