వాహనదారులకు రవాణ శాఖ ఒక శుభవార్తను అందించింది. ఏంటో తెలుసా? కొత్త వాహనం కొనుగోలు చేస్తే, టెంపరరీ రిజిస్ట్రేషన్ సంఖ్యను తీసుకున్న తరువాత, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం రావాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. ఇకపైన ఆ కష్టాలుండవు. రవాణశాఖ రిజిస్ట్రేషన్ చార్జీ చెల్లింపుల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పనిలేదు.
షోరూమ్లో వాహనాన్ని కొనేటప్పుడే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే కొత్త విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు రవాణా శాఖ కార్యాలయాల్లోనే ఆ రుసుము చెల్లించే విధానం ఉండేది. కానీ ఆర్టీఓ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్ ఆలస్యం అవుతుందన్న కారణం చేత ఈ కొత్త విధానానికి రవాణా శాఖ శ్రీకారం చుట్టింది.