Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలోని సగం సంపద అంతా ఆ ఎనిమిది మంది వద్దే : ఆక్స్ పామ్

ప్రపంచంలోని మొత్తం సంపదలో దాదాపు సగం సంపద కేవలం ఎనిమిది మంది వద్దే ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం నుంచి దావోస్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా 'ఆక్స్ ఫామ్' సంస్థ ఓ సర్వే నిర్వహించి, ఆ వివరాలను వెల్లడించ

ప్రపంచంలోని సగం సంపద అంతా ఆ ఎనిమిది మంది వద్దే : ఆక్స్ పామ్
, సోమవారం, 16 జనవరి 2017 (10:41 IST)
ప్రపంచంలోని మొత్తం సంపదలో దాదాపు సగం సంపద కేవలం ఎనిమిది మంది వద్దే ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సోమవారం నుంచి దావోస్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా 'ఆక్స్ ఫామ్' సంస్థ ఓ సర్వే నిర్వహించి, ఆ వివరాలను వెల్లడించింది. గత సంవత్సరంలో ధనికులకు, పేదలకు మధ్య ఉన్న వ్యత్యాసం మరింతగా పెరిగిందని ఈ సర్వేలో వెల్లడైంది. చైనా, భారత్‌ల నుంచి అందిన గణాంకాలను క్రోఢీకరించిన తర్వాత, సగం మంది వద్ద ఉన్న ఆస్తుల విలువ కరిగినట్టు వెల్లడించింది.
 
ప్రపంచంలోని సంపదంతా గత 2010 సంవత్సరంలో 43 మంది బిలియనీర్ల వద్ద ఉండగా, ఇప్పుడది ఎనిమిది మందికే పరిమితమైందని తెలిపింది. వారిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇండిటెక్స్ ఫౌండర్ అమానికో ఓర్టెగా, వెటరన్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్, మెక్సికోకు చెందిన కార్లోస్ స్లిమ్, అమేజాన్ బాస్ జెఫ్ బెజోస్, ఫేస్ బుక్ అధిపతి మార్క్ జుకర్ బర్గ్, ఒరాకిల్‌కు చెందిన లారీ ఎల్లిసన్, మాజీ న్యూయార్క్ మేయర్ మైఖేల్ బ్లూమ్ బర్గ్‌లు ఉన్నారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణం.. సోదరిపై అన్నయ్య అత్యాచారం