Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది

బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది
, శుక్రవారం, 29 మే 2015 (19:03 IST)
స్వదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. అదేసమయంలో వెండి ధర పెరిగింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి బంగారం ధర రూ.50 తగ్గింది. దాంతో పసిడి ధర మూడు వారాల కనిష్టానికి చేరింది. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం ధర రూ.27,225గా నమోదైంది. 
 
డిమాండ్ తగ్గడం, నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. మరోవైపు వెండి ధర మాత్రం ఈరోజు రూ.210 పెరిగింది. దాంతో కిలో వెండి రూ.38,750 పలుకుతోంది. నాణేల తయారీ దారులు కొనుగోళ్లు చేపట్టడంతో వెండి ధరలు పెరిగాయని బులియన్ వర్గాలు చెప్పాయి.

Share this Story:

Follow Webdunia telugu