Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రీస్ ఆర్థిక సంక్షోభం: ఆర్థికవేత్తల అసంబద్ధ అంచనాలపై జైట్లీ ఫైర్

గ్రీస్ ఆర్థిక సంక్షోభం: ఆర్థికవేత్తల అసంబద్ధ అంచనాలపై జైట్లీ ఫైర్
, మంగళవారం, 7 జులై 2015 (13:25 IST)
గ్రీస్ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థికవేత్తల వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. దేశంలో జరిగిన రెఫరెండం తర్వాత భారత కేపిటల్ మార్కెట్ ఒడిదుడుకులకు గురవుతుందన్న ఆర్థికవేత్తల అంచనాలపై ఆయన మండిపడ్డారు. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో భారత మార్కెట్ల పతనం తప్పదని ఆర్థికవేత్తలు అంచనాలేస్తే, మార్కెట్లు మాత్రం అందుకు విరుద్ధంగా లాభాలతో ముగిశాయని జైట్లీ పేర్కొన్నారు. 
 
ప్రముఖ ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. గ్రీస్ సంక్షోభం నేపథ్యంలో భారత మార్కెట్ల పతనం తప్పదని ఆర్థిక వేత్తలు అంచనాలేస్తే.. మార్కెట్లు మాత్రం అందుకు విరుద్ధంగా లాభాలతో ముగిశాయని పేర్కొన్నారు. అసంబద్ధంగా ఉన్న ఆర్థిక వేత్తల అంచనాలను చూస్తుంటే, జ్యోతిష్కులు చెప్పే విషయాలపై విశ్వసనీయత కలుగుతోందని జైట్లీ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu