Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టీల్ మిల్లు కోసం స్థలాలు కొనుగోలు: సెసా గోవా

స్టీల్ మిల్లు కోసం స్థలాలు కొనుగోలు: సెసా గోవా
స్టీల్ తయారీలో విభిన్నమైన మార్పులను లక్ష్యంగా చేసుకొని దేశీయ అతిపెద్ద ఐరన్ ఓర్ ఎగుమతి సంస్థ సెసా గోవా జార్ఖండ్‌లో నిర్మించబోయే తమ ప్లాంట్ కోసం ఈ ఆర్ధిక సంవత్సరంలోగా స్థలాలను కొనుగోలు చేయనుంది. జార్ఖండ్‌లో నిర్మించనున్న ప్రాజెక్టు కోసం స్థలాలు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీ చరిత్రలో మొదటి మైలురాయిని చేరుకోనున్నామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. ముఖర్జీ తెలిపారు.

విదేశీ ఎగుమతులను మరింత విస్తృతం చేయడానికి కంపెనీ గత సంవత్సరంలో జార్ఖండ్‌లో ఓ ప్రాజెక్టును నిర్మించాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెసా గోవా కంపెనీ గోవా ప్రాంతంలో "పిగ్ ఐరన్" ఉత్పత్తి సదుపాయాన్ని కలిగి ఉంది. గోవా, కర్నాటక, ఒరిస్సాలోని మైన్స్(గనుల)ను వేదాంత గ్రూప్ కంపెనీ నిర్వహిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu