సౌదీ అరబ్ పర్యాటకుల కోసం భారతదేశానికి చెందిన పర్యాటక శాఖ రియాద్లో రోడ్షో నిర్వహించింది.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకుగాను రోడ్షోలో విశాలమైన, అందమైన హిమాలయ పర్వతశ్రేణుల నుంచి గోవా బీచ్ తదితర సముద్రపు ఒడ్డుల చిత్రాలు, దేశ-విదేశీ స్థాయిలో ఆరోగ్యసేవా కేంద్రాలున్నట్లు రోడ్షోలో చూపించినట్లు పర్యాటక శాఖాధికారులు తెలిపారు.
దేశీయ టూర్ ఆపరేటర్లు మరియు భారతదేశపు పర్యాటక శాఖ కార్యాలయాల సంయుక్త భాగస్వామ్యంతో సౌదీ అరబ్ దేశాల్లోని భారతదేశపు దౌత్యకార్యాలయం సహాయంతో తాము రోడ్ షో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
తాము సంయుక్తంగా కలిసి నిర్వహించిన రోడ్ షోలో భారతదేశానికి చెందిన అతి పెద్ద టూర్ ఆపరేటర్లు దాదాపు తొమ్మదిమంది పాల్గొన్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలావుండగా ఈ షోలో విదేశీ సంస్థలైన సౌదీ ఆపరేటర్లలో దాదాపు 80 ఆపరేటర్లు పాల్గొన్నారు. ఇందులో దేశంలోని ప్రముఖ ఆసుపత్రులు, హోటళ్ళు, వంటకాల వివరాలను పొందుపరిచారు.