వెయ్యి రూపాయల డినామినేషన్ కలిగిన కొత్త నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) విడుదల చేయనుంది. ఈ కొత్త నోటులో మహాత్మాగాంధీ ఛాయాచిత్రం ఉంటుంది.
ఆర్బీఐ గవర్నర్ డీ. సుబ్బారావు హస్తాక్షరాలతోకూడిన మహాత్మాగాంధీ బొమ్మకల వెయ్యి రూపాయల నోటులో ఎల్ ఇన్సెట్ అక్షరం ఉంటుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి.
కొత్తగా విడుదల చేసే వెయ్యి రూపాయల నోటులో ఇన్సెట్ అక్షరం తప్ప మిగతా అంతా మామూలుగానే ఉంటుందని అధికారు పేర్కొన్నారు. ఇదిలావుండగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వెయ్యి రూపాయల నోట్లు అన్నీకూడా వాడుకలో ఉంటాయని అధికారులు తెలిపారు.