Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినియోగదారుల కోసం క్రెడయ్ బ్యాంకర్లతో కొత్త ప్రతిపాదన

వినియోగదారుల కోసం క్రెడయ్ బ్యాంకర్లతో కొత్త ప్రతిపాదన
, శనివారం, 9 ఫిబ్రవరి 2013 (21:15 IST)
ఇళ్లు కట్టుకునేందుకు స్థిరాస్తులను కొనుగోలు చేసేందుకు వీలుగా వినియోగదారులకు క్రెడయ్(CREDAI) ఓ సౌకర్యాన్ని కల్పించింది. చెన్నైలోని మొత్తం 7 బ్యాంకులను ఒకే గొడుగు కిందకు చేర్చి ప్రాపర్టీ ఫెయిర్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫెయిర్ ఫిబ్రవరి 2013 మూడోవారం ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా చెన్నైలో క్రెడయ్ అధ్యక్షులు సందీప్ మెహతా మాట్లాడుతూ... ఆయా బ్యాంకులు వినియోగదారులకు రుణాలు మంజూరు చేసే సమయంలో కావలసిన పత్రాలను సరిచూసి తదనంతరం రుణాలను ఇస్తుంటాయి.

ఐతే ఈ రుణాలపై వడ్డీ రేటు ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఉంటుంది కనుక 10 బ్యాంకులను ఒకదగ్గర చేర్చితే ఏ బ్యాంకు ప్యాకేజీ తమకు అనుకూలంగా ఉంటుందో సదరు వినియోగదారుడు ఆ బ్యాంకు నుంచి రుణాన్ని పొందే అవకాశం ఉంటుందన్నారు. వినియోగదారుని సౌలభ్యం కోసమే దీనిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఇంకా క్రెడయ్ కార్యదర్శి సురేష్ కృష్ణ మాట్లాడుతూ... ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేదని తెలుసుననీ, అయినప్పటికీ వినయోగదారుడు ఉండేందుకు గూడు కావాలని కోరుకుంటాడు. కనకు అతని సౌకర్యార్థం తాము బ్యాంకులను సంప్రదించి అన్నింటిని ఒకే గొడుగు కిందకు చేర్చి తద్వారా వినియోగదారునికి సహాయం చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలు బ్యాంకులకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu