Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత మార్కెట్లపై దృష్టిని కేంద్రీకరించిన 'రాడో'

భారత మార్కెట్లపై దృష్టిని కేంద్రీకరించిన 'రాడో'
భారత మార్కెట్లపై స్విజ్ కంపెనీ రాడో దృష్టి పెట్టింది. వాచీల తయారీలో ప్రసిద్ధి చెందిన రాడో ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేరళలోని తిరువనంతపురంలో రెండో ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ప్రారంభించనుంది. తర్వాత రాడో వాచీల షాపును రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

తమ వాచీలకు దక్షణ, ఉత్తర భారతదేశాల్లో మంచి మార్కెట్ ఉందని అందుకే భారత మార్కెట్‌పై దృష్టి పెట్టినట్లు రాడో ప్రతినిధి ఒకరు తెలిపారు. కోచిలోని రాడో కంపెనీ స్టోర్‌లో నెలకు 300 వాచీలను కంపెనీ విక్రయిస్తోంది. కోచితోపాటు రాడో కంపెనీకి దేశవ్యాప్తంగా 13 షోరూంలున్నాయి. కంపెనీ టర్నోవర్ 35 శాతం పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu