Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రోత్సాహక ప్యాకేజీలుంటాయి: ఆనంద్ శర్మ

ప్రోత్సాహక ప్యాకేజీలుంటాయి: ఆనంద్ శర్మ
, మంగళవారం, 10 నవంబరు 2009 (14:56 IST)
దేశంలోని ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలు ఇస్తుందని కేంద్ర వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ అన్నారు.

ప్రస్తుతం దేశంలోని వాతావరణ పరిస్థితులను తాము అర్థం చేసుకున్నామని, ఆర్థిక మాంద్యంతో ఉన్న వ్యాపారస్తులను ఆదుకునేందుకు వస్తువుల ఎగుమతికి సంబంధించిన ప్రోత్సాహక ప్యాకేజీలను వెనక్కు తీసుకునే ఆలోచన ఏదీ లేదని ఆయన తెలిపారు.

వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రోత్సాహక ప్యాకేజీలను తీసుకుంటామని ఆదివారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించడంతో వ్యాపారస్తులు కాస్త బెంబేలెత్తారు. దీంతో ఆనంద్ శర్మ మాట్లాడుతూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు ప్రోత్సాహక ప్యాకేజీలుంటాయని ఆయన వెల్లడింటచారు.

ఆర్ధిక మాంద్యం నుంచి బయటపడేంత వరకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రోత్సాహక ప్యాకేజీలు కొనసాగుతాయని ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ జీ-20 దేశాల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో జీ-20 శిఖరాగ్ర సమావేశం కూడా అందుకు ప్రోత్సహించిందని శర్మ గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu