Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీకు మ్యాక్స్ మొబైల్ బంపర్ ఆఫర్: 29 కోట్ల డీల్

ధోనీకు మ్యాక్స్ మొబైల్ బంపర్ ఆఫర్: 29 కోట్ల డీల్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ రేట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. క్రికెట్‌లో తాను చూపుతున్న ప్రతిభతో పలు కంపెనీలను ధోనీ ఇట్టే ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త, శాసనసభ సభ్యుడు విజయమాల్యకు చెందిన యూబి గ్రూపుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న ధోనీకు మరో బంపర్ ఆఫర్ లభించింది.

మ్యాక్స్ మొబైల్ కంపెనీకు ఏడేళ్లపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడానికి గానూ రూ. 29 కోట్ల విలువ చేసే డీల్‌పై ధోనీ సంతకం చేశాడు. ధోనీను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం వల్ల తమ ఉత్పత్తులకు అత్యుత్తమ ప్రచారం లభిస్తుందిని మ్యాక్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ అగర్వాల్ పిటిఐకు తెలిపారు.

కాగా.. గత వారంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్పిరిట్ తయారీ సంస్థ యూబి గ్రూపుతో ధోనీ రూ. 26 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇది కుదిరిన కొద్ది రోజుల్లోనే మరో అతిపెద్ద డీల్‌పై‌ ధోనీ సంతకం చేయడం విశేషం.

భారత్‌లో ఇటీవల ప్రవేశించిన మొబైల్ కంపెనీలలో మ్యాక్స్ మొబైల్ కూడా ఒకటి. రెండేళ్లలోపే మ్యాక్స్ లక్షల సంఖ్యలో హ్యాండ్ సెట్లను విక్రయించిది. అధునాతన ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్లు చవక ధరలకే అందించడం మ్యాక్స్ ప్రత్యేకత.

Share this Story:

Follow Webdunia telugu