Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో ప్రీమియం బైక్ : ఎమ్ అండ్ ఎమ్

త్వరలో ప్రీమియం బైక్ : ఎమ్ అండ్ ఎమ్
, శనివారం, 6 ఫిబ్రవరి 2010 (18:44 IST)
దేశీయ ఆటో నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న మహీంద్రా అండ్ మహీంద్రా ( ఎమ్ అండ్ ఎమ్ ) దేశీయ మార్కెట్లో ప్రీమియం బైక్‌ను ప్రవేశ పెట్టనుంది.

రానున్న రోజుల్లో తమ సంస్థ ప్రీమియం బైక్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందని మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధ్యక్షుడు అనూప్ మాథుర్ మీడియాకు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీమియం బైక్‌‌‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు అంతర్జాతీయ బైకుల కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనికిగాను బ్రిటన్‌కు చెందిన ట్రైయంఫ్, ఇటలీకి చెందిన మోటో గుజీ సంస్థలున్నాయి. ప్రీమియం బైక్‌కు సంబంధించి తమ కంపెనీ ఇప్పటికే ఒక మోడల్‌ను తయారు చేసిందన్నారు.

ప్రస్తుతం దేశంలోనున్న ద్విచక్ర వాహన నిర్మాణరంగంలోనున్న పలు కంపెనీలకు ధీటుగా మార్కెట్లోకి చొచ్చుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రైయంఫ్ కంపెనీ 1902 నుంచి ఉత్పత్తులను ప్రారంభించి అమ్మకాలలో ముందుందన్నారు. అలాగే మోటో గుజీ సంస్థ 1921 నుంచి ద్విచక్ర వాహనాల ఉత్పత్తులలో ముందుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu