టిక్కెట్లలో 47శాతం రాయితీ: మలేషియా ఎయిర్లైన్స్
భారతదేశంనుంచి మలేషియా దేశానికి విమానయానం చేసేవారికి ఆ దేశానికి చెందిన మలేషియా ఎయిర్లైన్స్ సంస్థ ప్రయాణీకులకు రాయితీలను ప్రకటించింది.మలేషియా ఎయిర్లైన్స్ సంస్థ తమ విమానంలో భారతదేశంనుంచి మలేషియాకు ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్టుపై 47 శాతం రాయితీనిచ్చినట్లు ఆ సంస్థ ప్రాంతీయ మేనేజర్ (దక్షిణాసియా) అజహర్ హమీద్ తెలిపారు. మలేషియా ఎయిర్లైన్స్ కంపెనీ ట్రావెల్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా యాత్రీకులు ఈ నెల 30 ఆగస్టు వరకు తాము అందించే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మలేషియా ఎయిర్లైన్స్ ట్రావెల్ ఫెయిర్ అందించే సేవలు తమ ప్రయాణీకులకు ఎల్లప్పుడూ సౌకర్యవంతంగానే ఉంటుందని ఆయన అన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.