Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహార భద్రత బిల్లు : ఎట్టకేలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన యూపీఏ

ఆహార భద్రత బిల్లు : ఎట్టకేలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన యూపీఏ
FILE
కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనలు.. ప్రాంతీయ పార్టీల అభ్యంతరాల మధ్యే ఆహార శాఖ మంత్రి కేవీ థామస్‌ ఆహార బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎలాంటి అభ్యంతరాలున్నా.. చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ, యూపీఏ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. కోట్లాది మందికి తక్కువ ధరకే ఆహారం అందించాలని రూపొందించిన ఫుడ్‌ సెక్యూరిటీ బిల్లును కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు చట్టరూపంలోకి మారితే.. దాదాపుగా 80 కోట్ల మంది ఆకలి తీరుతుందని ఆయన అన్నారు. సరసమైన ధరలకే ప్రతి నెలా 5 కిలోల ఆహార ధాన్యాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అటు ఈ బిల్లు రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందని తమిళనాడుకు చెందిన డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ఆరోపించాయి.

Share this Story:

Follow Webdunia telugu