శత్రు దేశాల నుంచి పొంచు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని దేశ రక్షణ రంగానికి ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి 1,41,700 కోట్ల రూపాయలు కేటాయించారు.
ఈ దఫా మరో 5640 కోట్ల రూపాయలు పెంచిన విత్తమంత్రి మొత్తం కేటాయింపులను రూ.1,47,340 కోట్లకు పెంచారు. అలాగే భారత్ నిర్మాణ రంగానికి 48 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. గత యేడాది ఈ పథకానికి 45 శాతం మేరకు నిధులు పెంచారు.