Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొటిమలకు చెక్ పెట్టాలా? సున్నిపిండి ప్యాక్ వేసుకోండి!

మొటిమలకు చెక్ పెట్టాలా? సున్నిపిండి ప్యాక్ వేసుకోండి!
, శుక్రవారం, 18 జులై 2014 (16:10 IST)
అమ్మాయిలను ప్రధానంగా బాధించే సమస్యల్లో ఒకటి మొటిమలు. వాటివల్ల భరించలేని నొప్పితో పాటు.. ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. దీంతో వారు తమ స్నేహితుల మధ్య కలిసిమెలసి ఉండలేక లోలోపల నరకయాతన అనుభవిస్తుంటారు. పైపెచ్చు.. మొటిమలు తగ్గినచోట మచ్చలు ఏర్పడి జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. 
 
ఇలాంటి వాటిని తగ్గించేందుకు గృహ చిట్కాలకు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. శెనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇది 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తరచుగా ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయని వారు చెపుతున్నారు. 
 
అలాగే, ఉల్లిరసంలో కొంచెం తేనె కలపాలి. దీన్ని మొటిమల మచ్చలపై రాయాలి. గంట తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి. 
 
ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేక మూడు సార్లు చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు మాయమవుతాయని వారు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu