Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నలుపెక్కిన చర్మానికి సెనగపిండితో ఛాయ!

నలుపెక్కిన చర్మానికి సెనగపిండితో ఛాయ!
, శనివారం, 18 అక్టోబరు 2014 (16:41 IST)
కాసేపు అలా బయటకి వెళ్లొస్తే చాలు.. శరీరంపై దుమ్మూధూళీ పేరుకుని చర్మం నల్లబడుతుంది. ఇలా ఏర్పడటానికి సులువుగా ఇంట్లోనే వదిలించుకోవచ్చు. సెనగపిండితో నలుగు పెట్టుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.
 
సెనగపిండిని ప్రతి రెండు రోజులకోసారి శరీరం మొత్తానికి పట్టించి రుద్దుతూ ఉంటే చర్మం తాజాగా మారుతుంది. సెనగపిండితో ఫేస్‌ప్యాక్‌ని కూడా తయారు చేయొచ్చు. రెండు చెంచాల సెనగపిండికి కొంచెం పసుపూ, చెంచా పాలూ, కాసిని రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. 
 
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు చాలామటుకూ తగ్గుతుంది. అలాగే సెనగపిండిలో నిమ్మరసం, పెరుగూ కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu