Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్మ సౌందర్యాన్ని పెంచే బాదం నూనె.. కొన్ని చిట్కాలు...

చర్మ సౌందర్యాన్ని పెంచే బాదం నూనె.. కొన్ని చిట్కాలు...
, శనివారం, 22 ఆగస్టు 2015 (14:41 IST)
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తీరికలేనంతగా ఉరుకులు బరుగులు తీస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు అందం విషయానికి వచ్చేసరికి హాల్ట్ అయిపోతున్నారు. అందం విషయంలో ఆడ, మగ ఇద్దరూ పోటీపడుతున్నారు. చర్మ సౌందర్యం కోసం వారు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి వారికి బాదం బాగా ఉపకరిస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఎ, ఇ ఉంటాయి. 
 
బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. కొందరి ముఖంపై, శరీరంపైన నల్లటి వలయాలు ఏర్పడతాయి. అప్పుడు బాదం నూనెలో, కొబ్బరి నూనెను కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
 
ముఖ తేజెస్సు పెరగాలంటే రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అర గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగు పోయి, తెల్లగా నిఘారింపుతో మిళ మిళ మెరిసిపోతుంది. అదేవిధంగా బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అర గంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.
 
అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.
 
సమపాళ్లలో బాదం నూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.

Share this Story:

Follow Webdunia telugu