దేశవ్యాప్తంగా జరిగిన 15వ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 369 పార్టీలు పోటీపడ్డాయి. వీటిలో 332 పార్టీలు అసలు ఖాతాకూడా తెరవలేక పోయాయి.
దేశంలో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో బాటు చిన్నా-చితకా పార్టీలుకూడా రంగంలోకి దిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 369 పార్టీలు పోటీ పడగా వీటిలో 332 పార్టీలు తమ ఖాతాను తెరవలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇదిలావుండగా 7 జాతీయ పార్టీలతో సహా మొత్తం 37 పార్టీలకు లోక్సభలో ప్రాతినిధ్యం లభించింది. కాగా లోక్ జనశక్తి పార్టీ, పట్టలి మక్కల్ కచ్చితోసహా గత లోక్సభలో ప్రాతినిధ్యం వహించిన ఎనిమిది పార్టీలు ఈ సారి కనీసం ఒక్క సీటునుకూడా కైవసం చేసుకోలేదని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.