మావాళ్ళని సంతలో ఆవుల్ని, మేకల్ని కొన్నట్లు కొంటున్నారు... ఉన్నత న్యాయస్థానం చర్యలు తీసుకోవాలంటూ, వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన నేతలపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటీషన్లో పేర్కొన్నారు.