Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు ఇంట్లో దేవాన్ష్ ఏడ్చినా.. జగన్ తొడబెల్లం పెట్టివుంటారని అంటారు : ఆర్కే.రోజా

రాష్ట్రమంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఏడ్చినా... విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తొడబెల్లం పెట్టివుంటాడని, అందుకే ఏడ్చాడని టీడీపీ నేతలు అంటారని వైకాపా ఎమ్మెల్య

చంద్రబాబు ఇంట్లో దేవాన్ష్ ఏడ్చినా.. జగన్ తొడబెల్లం పెట్టివుంటారని అంటారు : ఆర్కే.రోజా
, శుక్రవారం, 9 జూన్ 2017 (14:14 IST)
రాష్ట్రమంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ఏడ్చినా... విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తొడబెల్లం పెట్టివుంటాడని, అందుకే ఏడ్చాడని టీడీపీ నేతలు అంటారని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఎద్దేవా చేశారు. 
 
అసెంబ్లీలోని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గన్మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్‌లోకి వ‌ర్ష‌పు నీళ్లు రావ‌డంపై ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా త‌మ పార్టీ అధినేత‌పై కుట్ర జరుగుతోందన్నారు. టీడీపీ నేతల ప‌థ‌కం ప్ర‌కార‌మే జ‌గ‌న్‌ ఛాంబర్‌లో లీకేజీ వ్యవహారం జ‌రిగింద‌న్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ జగన్‌పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏ చిన్నపాటి సంఘటన జరిగినా అది జ‌గ‌న్ వ‌ల్లే జరిగిందంటూ టీడీపీ నేత‌లు గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకవేళ‌ చంద్రబాబు నాయుడి మనవడు దేవాన్ష్‌ ఏడ్చినప్ప‌టికీ జగనే గిచ్చి ఉంటార‌ని అంటారేమో? అని ఆమె ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ ఛాంబ‌ర్‌లో లీకేజీపై సీబీఐతో విచారణ జ‌రిపించాల‌ని రోజా డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాల్ గర్ల్ అనుకుని ఆమెకు నీలి చిత్రాలు పంపా... విజయవాడలో కామాంధుడు...